వార్తలకు తిరిగి వెళ్లండి
జీహెచ్ఎంసీ ఆఫీస్లో విచిత్ర పరిస్థితి

ఖైరతాబాద్లోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది. అధికారులు, బాధితులు ఇరువర్గాల హాజరు నామమాత్రంగానే ఉండటంతో ఈ కార్యక్రమం పూర్తి మొక్కుబడిగా సాగుతోంది.
సమస్యల పరిష్కారంలో అధికారుల అలసత్వం వల్లే బాధితులు రావడం మానేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రజావాణిపై రానురాను స్పందన పూర్తిగా కరవవుతుండటం నగరంలో చర్చనీయాంశంగా మారింది.
Comments
Loading comments...