వార్తలకు తిరిగి వెళ్లండి
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కర్నె ప్రభాకర్ విమర్శలు

ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి అసత్యాలు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. ప్రాజెక్టు పురోగతిపై ఆయనకు స్పష్టత లేదని, మాట తీరు మతిస్థిమితం లేనిదిగా ఉందని విమర్శించారు.
పదేళ్లలో 11 కిలోమీటర్ల పనులు పూర్తి చేసినా, ప్రస్తుత ప్రభుత్వం పనులను గాలికొదిలేసిందని మండిపడ్డారు. ప్రజాదరణ తగ్గుతుండటంతో సర్వే ఫలితాలు చూసి సీఎం మైండ్ బ్లాక్ అయి ఇలా మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
Comments
Loading comments...