వార్తలకు తిరిగి వెళ్లండి
నితిన్ నబీన్ పర్యటన ఫ్లాప్ షో: మహేశ్కుమార్ గౌడ్

బీజేపీ నేత నితిన్ నబీన్ తెలంగాణ పర్యటన ఘోరంగా విఫలమైందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ విమర్శించారు. కనీసం చిన్న సమావేశాలను కూడా సక్రమంగా నిర్వహించలేని వారు, గ్రేటర్ ఎన్నికల్లో గెలుస్తామని ప్రగల్భాలు పలకడం విడ్డూరమన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. నగర అభివృద్ధికి ఎలాంటి ప్రణాళికలు లేని బీజేపీ, కేవలం మత రాజకీయాల కోసమే పేర్ల మార్పు అంశాన్ని తెరపైకి తెస్తోందని ధ్వజమెత్తారు.
Comments
Loading comments...