వార్తలకు తిరిగి వెళ్లండి

పురపాలికల్లో కొత్త భవనాలకు ఇంకుడు గుంతల నిర్మాణం తప్పనిసరి అయినా అమలు ఆశించిన స్థాయిలో లేదని తెలుస్తోంది. ధరావతు రుసుము వసూలు చేస్తున్నప్పటికీ తనిఖీలు లేకుండానే ఇంటి నంబర్లు కేటాయిస్తున్న పరిస్థితి కొనసాగుతోంది.
దీంతో భూగర్భ జలాల సంరక్షణ లక్ష్యం దెబ్బతింటోంది. నిబంధనల అమలుకు తనిఖీలు నిర్వహించి ఇంకుడు గుంతల నిర్మాణాన్ని నిర్ధారించాలని పలువురు కోరుతున్నారు.
Comments
Loading comments...
