Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్థలాన్ని పరిశీలించిన అడిషనల్ కలెక్టర్

Follow Udayam on Google
p.g.murthy Aug 06, 2026 5:27 PM మంచిర్యాలGeneral
స్థలాన్ని పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ - Udayam
దండేపల్లి మండల కేంద్రంలో నూతన తాసిల్దార్ కార్యాలయ భవన నిర్మాణ స్థలాన్ని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ వి రాములు పరిశీలించారు. గురువారం సాయంత్రం దండేపల్లిలో స్థానిక తాసిల్దార్ రోహిత్ దేశ్పాండే తో ఆయన స్థలాన్ని పరిశీలించారు. మంచిర్యాల జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...