వార్తలకు తిరిగి వెళ్లండి

మారుతున్న డిజిటల్ అవసరాలకు అనుగుణంగా సొంతంగా ఒక ఫిన్టెక్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఎల్ఐసీ యోచిస్తోంది. పాలసీదారుల నిధులపై మరింత మెరుగైన రాబడిని అందించేందుకు, ప్రముఖ ఇన్సూర్టెక్ సంస్థల్లో వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టనున్నట్లు సంస్థ సీఈఓ ఆర్.దొరైస్వామి వెల్లడించారు.
మార్కెట్ పోటీని తట్టుకునేందుకు తమ ఐటీ అప్లికేషన్లను ఆధునికీకరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సొంత సాఫ్ట్వేర్ అభివృద్ధి కేంద్రం ద్వారా సాంకేతిక సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

