వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల మండలం అనంతారం గ్రామంలో షేర్వాల్ టెక్నాలజీతో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇంటిని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పరిశీలించారు. సుమారు రూ.5 లక్షల వ్యయంతో డబుల్ బెడ్రూమ్, హాల్, కిచెన్తో ఇంటిని నిర్మిస్తున్న యువత సతీష్, విద్యాసాగర్లను అభినందించారు.
తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో ఇళ్ల నిర్మాణానికి ఆధునిక సాంకేతికతలను వినియోగించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పేదల సొంతింటి కల నెరవేరుతోందన్నారు.
Comments
Loading comments...

