వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగి మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు, మిట్టకోడూర్ గ్రామ సర్పంచ్ మాణిక్యం తన ఔదార్యాన్ని చాటుకున్నారు. గ్రామానికి చెందిన నిరుపేద వృద్ధ దంపతులు బ్యాగరి అంజిలమ్మకు వృద్ధాప్య పెన్షన్ అందడం లేదని ఆయన తెలుసుకున్నారు.
వారి పరిస్థితిని చూసి చలించిన సర్పంచ్, తనకు రేషన్ ద్వారా అందే 3 నెలల బియ్యాన్ని ఆ వృద్ధ దంపతులకు అందజేశారు. కష్టకాలంలో ఆసరాగా నిలిచిన సర్పంచ్ చొరవను గ్రామస్థులు అభినందించారు.
Comments
Loading comments...

