వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు భారీగా పెరగడం పట్ల కలెక్టర్ శ్రీహర్ష సంతృప్తి వ్యక్తం చేశారు. గత విద్యాసంవత్సరంతో పోల్చితే నమోదైన విద్యార్థుల సంఖ్య పెరగడం సర్కారు విద్యపై ప్రజల్లో మారుతున్న ఆలోచనా విధానానికి నిదర్శనమని పేర్కొన్నారు.
విద్యార్థులకు నాణ్యమైన, ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యనందించేందుకు విద్యాశాఖ ద్వారా అన్ని చర్యలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...

