వార్తలకు తిరిగి వెళ్లండి

ఎగువన జూరాల నుంచి వరద ప్రవాహం పెరగడంతో శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం స్వల్పంగా పెరిగింది. బుధవారం సాయంత్రానికి నీటిమట్టం 879.10 అడుగులు, నిల్వ 183.4198 టీఎంసీలుగా నమోదైంది.
జూరాల నుంచి 83,161 క్యూసెక్కులు శ్రీశైలానికి చేరుతున్నాయి. విద్యుదుత్పత్తితో పాటు పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా, ఎంజీకేఎల్ఐకి నీటిని విడుదల చేస్తున్నారు.
Comments
Loading comments...

