వార్తలకు తిరిగి వెళ్లండి
శ్రీనివాసగిరి సోయగం

భద్రాద్రి జిల్లా పాల్వంచలోని శ్రీనివాసగిరి స్వయంభు శ్రీనివాసుడి ఆలయం భక్తులను ఆకర్షిస్తోంది. సుమారు రెండు వేల మెట్లు ఎక్కి కొండపైకి చేరుకునే భక్తులకు అక్కడి నుంచి పచ్చని ప్రకృతి, మొర్రేడు వాగు దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి.
ఆలయం నుంచి పామాయిల్ తోటలు, వరి పొలాలు, పాల్వంచ పట్టణ దృశ్యాలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఆధ్యాత్మికతతో పాటు ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు భక్తులు తరలివస్తున్నారు.
Comments
Loading comments...