వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం ఎల్ఎండీ లోని మినీ బీచ్ వద్ద ప్రమాదవశాత్తు నీట మునిగి తేడంకి పృథ్వీరాజు (29) అనే యువకుడు మృతి చెందాడు.
కరీంనగర్లోని ఓ కళాశాలలో పనిచేస్తున్న మిత్రుడు రేవంత్ను కలిసేందుకు పృథ్వీరాజు, తేజ, నానిబాబు వచ్చారు. నలుగురు సరదాగా డ్యాం వద్దకు వెళ్లగా పృథ్వీరాజు నీటిలో గల్లంతయ్యాడు. ఈతగాళ్లు మృతదేహాన్ని వెలికితీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

