వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరు పురపాలక సంఘ పరిధిలోని నెల్లటూరులో నూతనంగా ప్రతిష్ఠించిన శ్రీ నాగేంద్ర స్వామికి విశేష పూజలు నిర్వహించారు. స్వామివారికి క్షీరాభిషేకం, పంచామృతాభిషేకం, జలాభిషేకం చేశారు.
వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య వేడుకలు వైభవంగా జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
Comments
Loading comments...

