వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో 'నేషనల్ రేర్ డిసీజెస్ పాలసీ' అమలుకు ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకుంటోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విశాఖ, విజయవాడ, తిరుపతిలో ప్రత్యేకంగా మూడు 'సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్' కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
వ్యాధిగ్రస్తులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రత్యేక నిధుల ఏర్పాటు అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామని మంత్రి హామీ ఇచ్చారు. అరుదైన వ్యాధుల ముందస్తు గుర్తింపు కోసం 'యూనివర్సల్ నియోనాటల్ స్క్రీనింగ్' కూడా చేపట్టినట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

