వార్తలకు తిరిగి వెళ్లండి
రంపచోడవరం ఎమ్మెల్యే పర్యటన: రేపు కీలక శంకుస్థాపనలు
అమరేష్ గౌడ్ Jun 24, 2026 11:08 AM విశాఖపట్నం 2 viewsabout 13 hours ago

రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషా దేవి గురువారం అల్లూరి జిల్లాలో పర్యటించనున్నారు. అడ్డతీగల మండలం పింజరికొండలో ఎంపీపీ పాఠశాల ప్రారంభోత్సవం, అనంతరం గంగవరం మండలం మొల్లేరులో మోడల్ ట్యాంక్ అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపన చేస్తారని ఎమ్మెల్యే కార్యాలయం వెల్లడించింది.
రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్పర్సన్గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమె, ఈ పర్యటనలో స్థానిక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు క్యాంపు కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి.
Comments
Loading comments...