వార్తలకు తిరిగి వెళ్లండి
భోగాపురం విమానాశ్రయం: టారిఫ్ల ఖరారు
మహేష్ కుమార్ Jun 24, 2026 1:20 PM విజయనగరం 5 viewsabout 11 hours ago

భోగాపురం విమానాశ్రయానికి ఏఈఆర్ఏ తాత్కాలిక టారిఫ్లను ఆమోదించింది. దేశీయ ప్రయాణికులకు రూ. 835 (బయలుదేరేటప్పుడు), రూ. 355 (చేరుకునేటప్పుడు) యూడీఎఫ్ వసూలు చేయనున్నారు. అంతర్జాతీయ ప్రయాణికులకు ఈ రుసుములు వరుసగా రూ. 1,255, రూ. 545గా నిర్ణయించారు.
అలాగే ల్యాండింగ్ ఫీజును దేశీయ విమానాలకు రూ. 1,400గా, అంతర్జాతీయ విమానాలకు రూ. 1,975గా ఖరారు చేశారు. వచ్చే నెల నుండి విశాఖ పౌర విమాన సేవలు ఇక్కడికి మారనున్నాయి.
Comments
Loading comments...