వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలం దత్తత ఆలయం కొలను భారతిలో అనుమతుల్లేకుండా హోమాలు నిర్వహించారనే ఆరోపణలపై ఈవో శ్రీనివాసరావు విచారణకు ఆదేశించారు. ఏఈఓ ఫణీధర్ ప్రసాద్ క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి, నిబంధనలను ఉల్లంఘించిన హోమ గుండాన్ని తొలగించారు.
ట్రస్ట్ బోర్డు సభ్యుడి సహకారంతో ఎన్నారై భక్తులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేసి తక్షణమే నివేదిక సమర్పించాలని ఈవో అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

