వార్తలకు తిరిగి వెళ్లండి

పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి కృషి ఫలితంగా, ఓబుల దేవర చెరువు మండలం గౌరాపురంలో నిర్మిస్తున్న రామాలయానికి టీటీడీ శ్రీవాణి ట్రస్టు ద్వారా రూ. 40 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధుల విడుదలతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బుధవారం ఎమ్మెల్యే గ్రామాన్ని సందర్శించి, రామాలయ నిర్మాణ ప్రాంతంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నిధులతో ఆలయ నిర్మాణం వేగంగా పూర్తి చేస్తామని తెలిపారు.
Comments
Loading comments...

