Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్లమెంట్ నిర్వహణపై స్పీకర్ విజ్ఞప్తి

రవళి దేవి Jul 20, 2026 11:02 AM అల్ ఇండియా about 18 hours ago
పార్లమెంట్ నిర్వహణపై స్పీకర్ విజ్ఞప్తి - Udayam Digital
వర్షాకాల సమావేశాల వేళ సభ్యులందరూ సహకారంతో సభలో పాల్గొనాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కోరారు. రాజ్యాంగ నిబంధనలు, పార్లమెంటరీ సాంప్రదాయాలు, సభా మర్యాదలను కాపాడుతూ సజావుగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. చట్టసభల పనితీరు సక్రమంగా సాగడం అందరి ఉమ్మడి బాధ్యత అని ఆయన అన్నారు. ప్రజోపయోగ నిర్ణయాలు, అర్థవంతమైన చర్చలతో ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల ప్రజలకు నమ్మకాన్ని పెంచాలని ఎంపీలను కోరారు.

Comments

G
Loading comments...