Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తండ్రి వెంటే వెళ్లిన కుమారుడు

నవీన్ రెడ్డి Jul 16, 2026 9:49 PM కర్నూలు 2 viewsabout 2 hours ago
తండ్రి వెంటే వెళ్లిన కుమారుడు - Udayam Digital
నాగర్‌కర్నూల్‌ జిల్లా తాడూరు మండలం చెన్నోళ్ల కాలనీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అనారోగ్యంతో బుధవారం వృద్ధుడు సాయిలు (75) మరణించగా, ఆ దుఃఖంలో ఉన్న చిన్నకుమారుడు బంగారయ్య (50) గురువారం అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. తండ్రి చనిపోయిన మరుసటి రోజే కొడుకు కూడా మృతిచెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర రోదనలు మిగిలాయి. ఈ ఘటనతో స్థానిక గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

Comments

G
Loading comments...