వార్తలకు తిరిగి వెళ్లండి
ఉత్తరాంధ్రకు భారీ వాన గండం

వాయవ్య బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రాబోయే మూడు రోజుల పాటు భారీ నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్ పి.ఎల్.ఎన్.మూర్తి వెల్లడించారు.
ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడతాయని, తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని తెలిపారు. కాగా, దక్షిణ కోస్తాలో మాత్రం ఉక్కపోత వాతావరణం కొనసాగుతుంది.
Comments
Loading comments...