వార్తలకు తిరిగి వెళ్లండి

కులవివక్ష, అంటరానితనం నిర్మూలనతో పాటు సామాజిక న్యాయం కోసం ఈ నెల 24న పుట్టపర్తిలో ధర్నా నిర్వహించనున్నారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు అయూబ్ ఖాన్ ప్రజలు, రైతులు, చేనేతలు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.
బుధవారం ధర్మవరం సీఐటీయూ కార్యాలయంలో సామాజిక శంఖారావం కరపత్రాలను విడుదల చేశారు. అంటరానితనం నిర్మూలనకు జ్యోతిబాపూలే, పుచ్చలపల్లి సుందరయ్య చేసిన పోరాటాలను గుర్తు చేశారు.
Comments
Loading comments...

