వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్ చౌరస్తాలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. తండ్రి రఫీతో కలిసి ద్విచక్రవాహనంపై పాఠశాలకు వెళ్తున్న ఆరేళ్ల ఫాతిమాను వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనతో కుటుంబసభ్యులు, స్థానికులు విషాదంలో మునిగారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

