వార్తలకు తిరిగి వెళ్లండి

వేమూరు నియోజకవర్గంలోని భట్టిప్రోలు, కొల్లూరు, వేమూరు మండలాలకు చెందిన ఆరుగురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.6,99,893 మంజూరైంది. అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారికి ఈ సాయం అందింది.
గుంటూరులో ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ఎల్ఓసీ పత్రాలను బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. అత్యవసర వైద్య చికిత్సకు సీఎం సహాయనిధి పేద, మధ్యతరగతి కుటుంబాలకు భరోసాగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

