వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్లలో కాటన్ చీరల కార్మికులు, ఆసాముల కూలీ పెంపు కోసం చేపట్టిన సమ్మె మూడో రోజు కొనసాగింది. CITU పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్మికులకు చీరకు రూ.100, ఆసాములకు రూ.150 కూలీ పెంచాలని జిల్లా అధ్యక్షుడు కోడం రమణ డిమాండ్ చేశారు.
కూలీ పెంచకపోతే యజమానుల ఇళ్ల ముందు ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

