Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్లలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ

Follow Udayam on Google
Sircilla jilla news Sep 14, 2026 8:10 PM రాజన్న సిరిసిల్లGeneral
సిరిసిల్ల వెంకంపేటలో ఆదివారం రాత్రి ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కర్రలతో పరస్పరం దాడులకు దిగడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఓ వర్గానికి చెందిన తండ్రి, కొడుకులిద్దరూ గాయపడ్డారు. పద్మశాలి యువజన సంఘం ఎన్నికల్లో పోటీ చేసిన యువకుల మధ్య పాత విభేదాలే ఘర్షణకు కారణమని తెలుస్తోంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...