వార్తలకు తిరిగి వెళ్లండి
రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పలు రహదారులు జలమయమయ్యాయి. పాత బస్టాండ్, నేతన్న చౌక్, వెంకంపేట రోడ్డు, సంజీవయ్యనగర్, ఆటోనగర్ ప్రాంతాల్లో వర్షపు నీరు భారీగా నిలిచింది. సిరిసిల్ల–కరీంనగర్ ప్రధాన రహదారిపైనా నీరు చేరడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
కొన్ని ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీరు నిలవగా, డ్రైనేజీ మురుగు నీరు రోడ్లపైకి చేరింది.
Comments
Loading comments...

