వార్తలకు తిరిగి వెళ్లండి
సిరిసిల్ల లోని రగుడు కనకదుర్గ రైస్ మిల్లులో సివిల్ సప్లై అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. డీఎస్ఓ బుచ్చిబాబు ఆధ్వర్యంలో జరిగిన తనిఖీల్లో అక్రమంగా నిల్వ చేసిన సుమారు 250 క్వింటాళ్ల పీడీఎస్ రేషన్ బియ్యాన్ని అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని సంచుల్లో నింపి మరో రైస్ మిల్లులో భద్రపరిచారు.
పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని డీఎస్ఓ హెచ్చరించారు.
Comments
Loading comments...

