Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగూర్ ప్రాజెక్టులో 4.262 టీఎంసీల నీటి నిల్వ

Follow Udayam on Google
బాలాజీ Aug 12, 2026 9:21 AM సంగారెడ్డిGeneral
సింగూర్ ప్రాజెక్టులో 4.262 టీఎంసీల నీటి నిల్వ - Udayam
సింగూర్ డ్యాంలో నీటిమట్టం స్వల్పంగా పెరిగింది. బుధవారం ఉదయం 6 గంటల నాటికి డ్యాంలో 515.235 మీటర్ల నీటిమట్టం నమోదైంది. డ్యాం పూర్తి స్థాయి నీటిమట్టం 523.600 మీటర్లు కాగా, ప్రస్తుతం 4.262 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 29.917 టీఎంసీలు. గత 24 గంటల్లో సగటు నీటి ప్రవాహం 692 క్యూసెక్కులు కాగా, సగటు నీటి విడుదల 380 క్యూసెక్కులుగా నమోదైంది.

Comments

G
Loading comments...