Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీమా కోసం సింగరేణి పెన్షనర్ల నిరసన

శ్రుతి రెడ్డి Jul 27, 2026 6:11 PM మంచిర్యాలతెలంగాణ
బీమా కోసం సింగరేణి పెన్షనర్ల నిరసన - Udayam Digital
మంచిర్యాల జిల్లా తాండూర్‌లో యూనియన్ బ్యాంక్ ఎదుట సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా నిర్వహించారు. పెన్షన్‌దారులకు బీమా సౌకర్యం కల్పించడంలో బ్యాంక్ నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. 2024 ఒప్పందం ప్రకారం 70 ఏళ్లలోపు పెన్షనర్లకు ప్రమాద బీమా, సహజ మరణ బీమా అమలు చేయాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లో పరిష్కరించకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...