వార్తలకు తిరిగి వెళ్లండి
పర్యావరణ పరిరక్షణకు సింగరేణి పెద్దపీట

బొగ్గు ఉత్పత్తితో పాటు పర్యావరణ పరిరక్షణకు సింగరేణి సంస్థ పెద్దపీట వేస్తోందని సత్తుపల్లి ఏరియా జీఎం చింతల శ్రీనివాస్ తెలిపారు. జేవీఆర్ ఓసీ ప్రాజెక్ట్ పరిధిలో నిర్వహించిన కార్యక్రమంలో ఏరియా వ్యాప్తంగా 10 వేల మొక్కలు నాటారు.
భవిష్యత్ తరాల మనుగడ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...