Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీరియల్ బాంబు పేలుళ్ల కేసులో 38 మంది దోషులకు ఉరిశిక్ష,

DILIPREDDY Jul 07, 2026 9:52 AM అల్ ఇండియా 1 viewsabout 1 hour ago
సీరియల్ బాంబు పేలుళ్ల కేసులో 38 మంది దోషులకు ఉరిశిక్ష, - Udayam Digital

Photo Gallery

సీరియల్ బాంబు పేలుళ్ల కేసులో 38 మంది దోషులకు ఉరిశిక్ష, - main
సీరియల్ బాంబు పేలుళ్ల కేసులో 38 మంది దోషులకు ఉరిశిక్ష, - gallery image
2008 అహ్మదాబాద్ సీరియల్ బాంబు పేలుళ్ల కేసులో 38 మంది దోషులకు విధించిన ఉరిశిక్షను, మరో 11 మందికి విధించిన యావజ్జీవ కారాగార శిక్షను గుజరాత్ హైకోర్టు ఖరారు చేసింది. మొత్తం 56 మంది ప్రాణాలను బలిగొన్న ఈ ఘోర దురంతంపై ప్రత్యేక కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ఉన్నత న్యాయస్థానం సమర్థించింది. మొత్తం 49 మంది దోషులకు విధించిన శిక్షలను ధృవీకరిస్తూ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దేశ చరిత్రలోనే ఒకే కేసులో ఇంతమందికి మరణశిక్ష పడటం ఇదే ప్రథమం. ఈ చారిత్రాత్మక తీర్పుతో బాధితుల కుటుంబాలకు ఎట్టకేలకు న్యాయం జరిగింది.

Comments

G
Loading comments...