వార్తలకు తిరిగి వెళ్లండి
క్రైమ్Breaking
సీరియల్ బాంబు పేలుళ్ల కేసులో 38 మంది దోషులకు ఉరిశిక్ష,

Photo Gallery
2008 అహ్మదాబాద్ సీరియల్ బాంబు పేలుళ్ల కేసులో 38 మంది దోషులకు విధించిన ఉరిశిక్షను, మరో 11 మందికి విధించిన యావజ్జీవ కారాగార శిక్షను గుజరాత్ హైకోర్టు ఖరారు చేసింది. మొత్తం 56 మంది ప్రాణాలను బలిగొన్న ఈ ఘోర దురంతంపై ప్రత్యేక కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ఉన్నత న్యాయస్థానం సమర్థించింది.
మొత్తం 49 మంది దోషులకు విధించిన శిక్షలను ధృవీకరిస్తూ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దేశ చరిత్రలోనే ఒకే కేసులో ఇంతమందికి మరణశిక్ష పడటం ఇదే ప్రథమం. ఈ చారిత్రాత్మక తీర్పుతో బాధితుల కుటుంబాలకు ఎట్టకేలకు న్యాయం జరిగింది.
Comments
Loading comments...