Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

సంతకం ఫోర్జరీ కేసు: టీఎంసీ ఎమ్మెల్యే కునాల్ ఘోష్‌కు సీఐడీ సమన్లు!

Sonia Singh Jun 14, 2026 10:21 AM అల్ ఇండియా 36 viewsabout 24 hours ago
సంతకం ఫోర్జరీ కేసు: టీఎంసీ ఎమ్మెల్యే కునాల్ ఘోష్‌కు సీఐడీ సమన్లు! - Udayam Digital
​పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో తృణమూల్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే కునాల్ ఘోష్‌కు రాష్ట్ర సిఐడి విభాగం అధికారులు గట్టి షాక్ ఇచ్చారు. ఒక వివాదాస్పద సంతకం ఫోర్జరీ కేసు వ్యవహారంలో ఆయనకు సీఐడీ తాజాగా సమన్లు జారీ చేసింది. ​ఈ కేసు దర్యాప్తులో భాగంగా విచారణ నిమిత్తం కోల్‌కతాలోని భవానీ భవన్‌కు హాజరుకావాలని అధికారులు ఆయనను ఆదేశించారు. కునాల్ ఘోష్ రాక నేపథ్యంలో భవానీ భవన్ వెలుపల భద్రతను పటిష్టం చేస్తూ భారీగా పోలీసులను అక్కడ మోహరించారు.

Comments

G
Loading comments...