Back to feed
సంతకం ఫోర్జరీ కేసు: టీఎంసీ ఎమ్మెల్యే కునాల్ ఘోష్కు సీఐడీ సమన్లు!
Sonia Singh Jun 14, 2026 10:21 AM అల్ ఇండియా 36 viewsabout 24 hours ago

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో తృణమూల్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే కునాల్ ఘోష్కు రాష్ట్ర సిఐడి విభాగం అధికారులు గట్టి షాక్ ఇచ్చారు. ఒక వివాదాస్పద సంతకం ఫోర్జరీ కేసు వ్యవహారంలో ఆయనకు సీఐడీ తాజాగా సమన్లు జారీ చేసింది.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా విచారణ నిమిత్తం కోల్కతాలోని భవానీ భవన్కు హాజరుకావాలని అధికారులు ఆయనను ఆదేశించారు. కునాల్ ఘోష్ రాక నేపథ్యంలో భవానీ భవన్ వెలుపల భద్రతను పటిష్టం చేస్తూ భారీగా పోలీసులను అక్కడ మోహరించారు.
Comments
Loading comments...



