వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం: మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మకు ఊరట లభించింది. కాశీబుగ్గ రోడ్డు ప్రమాద కేసులో సోంపేట కోర్టు మంగళవారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇటీవల జరిగిన ప్రమాదంలో ఓ గొర్రెల కాపరి మృతి చెందడంతో నమోదైన కేసులో ఆరవ్ వర్మ జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బెయిల్ లభించడంతో ఆయన విడుదలకు మార్గం సుగమమైంది.
Comments
Loading comments...
