వార్తలకు తిరిగి వెళ్లండి
శ్రీకాకుళం రూరల్: మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం సాయంత్రం వాతావరణ మార్పులతో ఒక్కసారిగా మోస్తరు వర్షం కురిసింది.నైర, అలికాం, రోనంకి తదితర ప్రాంతాల్లో వర్షం పడడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ వర్షం ఖరీఫ్ పంటలకు ఎంతో మేలు చేస్తుందని వ్యవసాయ నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు, వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు.
Comments
Loading comments...
