వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో ప్రసిద్ధ గండి వీరాంజనేయస్వామి ఆలయంలో నేటి నుంచి శ్రావణమాస ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ప్రతిరోజూ ఉదయం 4 నుంచి 4.30 వరకు అభిషేకం, 4.30 నుంచి 5 వరకు అలంకరణ, 5.30 నుంచి మధ్యాహ్నం 12 వరకు సర్వదర్శనం నిర్వహించనున్నారు.
మధ్యాహ్నం 12.30కి మహానైవేద్యం, మంగళహారతి అనంతరం స్వామివారి దర్శనాలు ఉంటాయని ఛైర్మన్ వెంకటస్వామి, ఈవో విశ్వనాథ్ తెలిపారు. భక్తులు విరివిగా పాల్గొనాలని కోరారు.
Comments
Loading comments...

