వార్తలకు తిరిగి వెళ్లండి

లింగాల మండలం పార్నపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సరిపడా మధ్యాహ్న భోజనం అందక ఇబ్బందులు ఎదురయ్యాయి. హాజరైన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అన్నం, కూర వండకపోవడంతో చివర్లో వచ్చిన పలువురు విద్యార్థులకు భోజనం లేకుండా పోయింది.
నిర్వాహకుల నిర్లక్ష్యంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు.
Comments
Loading comments...

