వార్తలకు తిరిగి వెళ్లండి

సీతంపేట మండలం సామరెల్లి–రాయికురిడి గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారిలోని కల్వర్టు శిథిలావస్థకు చేరింది. కింద భాగం దెబ్బతినడంతో రాళ్లు కూలిపడి ప్రమాదకరంగా మారింది.
ఈ మార్గంలో నిత్యం గ్రామస్థులు, వాహనదారులు రాకపోకలు సాగిస్తుండటంతో ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే కల్వర్టును పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

