వార్తలకు తిరిగి వెళ్లండి

బొడ్డుసామంతరవలసలోని ప్రాథమిక గిరిజన పాఠశాల శిథిలావస్థకు చేరడంతో వరండాలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. భవనం పైకప్పు నుంచి తరచూ పెచ్చులూడి పడుతుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు హెచ్ఎం వెంకందొర తెలిపారు. ఇప్పటికైనా నిధులు మంజూరు చేసి భవనానికి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

