వార్తలకు తిరిగి వెళ్లండి

గుండంపల్లి గ్రామ అంగన్వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ దప్పుల పద్మ నర్సయ్య మాట్లాడుతూ నవజాత శిశువులకు తల్లిపాలే అత్యుత్తమ పోషకాహారమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో చిన్నారులకు అన్నప్రాశన, అక్షరాభ్యాసం, గర్భిణీలకు శ్రీమంతం నిర్వహించి తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. గ్రామ కార్యదర్శి కవిత, అంగన్వాడీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

