Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శేరికర్ రమేష్‌ గళం.. ఉపాధ్యాయుల హక్కుల కోసం పోరాటం

Follow Udayam on Google
BALAJI SRIMANGALI Sep 01, 2026 6:32 PM సంగారెడ్డిGeneral
శేరికర్ రమేష్‌ గళం.. ఉపాధ్యాయుల హక్కుల కోసం పోరాటం - Udayam
హైదరాబాద్‌ ధర్నా చౌక్‌లో నాగల్‌గిద్ద మండల పీఆర్‌టీయూ ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా అధ్యక్షులు శేరికర్‌ రమేష్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలని, పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని, 317 జీవో సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...