Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శాయంపేట ప్రమాదంలో 10 మంది ఉపాధ్యాయులకు గాయాలు

Follow Udayam on Google
శివ కుమార్ Aug 01, 2026 3:16 PM హన్మకొండ General
శాయంపేట ప్రమాదంలో 10 మంది ఉపాధ్యాయులకు గాయాలు - Udayam
శాయంపేట మండలం మాందారిపేట స్టేజీ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది ఉపాధ్యాయులు గాయపడ్డారు. మహాదేవ్‌పూర్‌ పాఠశాలకు వెళ్తున్న ఉపాధ్యాయుల ఆటో పెట్రోల్‌ బంక్‌ వద్దకు వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 9 మంది ఉపాధ్యాయులకు స్వల్ప గాయాలు కాగా, ఆటో డ్రైవర్‌ వేణుతో పాటు ఓ ఉపాధ్యాయుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...