వార్తలకు తిరిగి వెళ్లండి

నరసన్నపేట మేజర్ పంచాయతీలో సెంటర్ లైటింగ్ కొన్ని నెలలుగా పని చేయకపోవడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
రాత్రి వేళల్లో రహదారులపై కుక్కలతో పాటు పశువులు కూడా ఉండడంతో పలుమార్లు ప్రమాదాలకు గురి అయ్యారు. సమస్యను గుర్తించిన పంచాయితీ ఇన్ఛార్జ్ ఈవో జగన్మోహనరావు చర్యలకు శ్రీకారం చుట్టారు. శ్రీకాకుళం నుంచి సిబ్బందిని రప్పించి మరమ్మతులు చేపడుతున్నారు. ప్రతి ఒక్క లైటు వెలిగేలా సరి చేస్తామన్నారు.
Comments
Loading comments...

