వార్తలకు తిరిగి వెళ్లండి

నిరుద్యోగ గిరిజన యువతను గుర్తించి జూన్ 1వ తేదీలోపు భవిత శిక్షణ కేంద్రాలకు పంపాలని ఐటీడీఏ పీవో బి.రాహుల్ అధికారులను ఆదేశించారు. ఆరు సెక్టార్లలోని 25 కోర్సుల్లో 90 రోజుల పాటు శిక్షణ అందించి, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉపాధి కల్పించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం.
అంతేకాకుండా స్వయం ఉపాధి కోసం ముద్రా రుణాలు కూడా ఇప్పించనున్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఇంటి వద్దే నేర్చుకునే కోర్సులను కూడా అందుబాటులోకి తెచ్చినట్లు పీవో తెలిపారు.
Comments
Loading comments...

