వార్తలకు తిరిగి వెళ్లండి

రాఖీ పండుగ సందర్భంగా దేశ, విదేశాల్లో ఉన్న సోదరులకు రాఖీలు, బహుమతులు, గ్రీటింగ్ కార్డులను ఇండియా పోస్టు ద్వారా పంపాలని నెల్లూరు తపాలా శాఖ సూపరింటెండెంట్ శ్రీనివాసులు సూచించారు. వీటిని సకాలంలో, సురక్షితంగా చేరేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.
ప్రజలు తపాలాశాఖ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పోస్టు ద్వారా రాఖీ పండుగ శుభాకాంక్షలను తమ ఆత్మీయులకు చేరవేయాలని సూచించారు.
Comments
Loading comments...

