వార్తలకు తిరిగి వెళ్లండి

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు, చమురు ధరల పెరుగుదలతోపాటు అమెరికా వడ్డీ రేట్లపై ఆందోళనతో ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. ఐటీ, మెటల్, పీఎస్యూ బ్యాంక్ షేర్లలో అమ్మకాలు కొనసాగాయి.
సెన్సెక్స్ 382.62 పాయింట్లు కోల్పోయి 76,132.81 వద్ద ముగిసింది. నిఫ్టీ 118.55 పాయింట్లు పతనమై 23,779.15 వద్ద స్థిరపడింది. రూపాయి విలువ 94.48గా ఉంది.
Comments
Loading comments...

