వార్తలకు తిరిగి వెళ్లండి
భద్రతా కారణాలరీత్యా ఢిల్లీలో 18 మెట్రో స్టేషన్లు మూసివేత

భద్రతా కారణాలరీత్యా ఢిల్లీలో ఉదయం 7:30 గంటల నుంచి 18 మెట్రో స్టేషన్లను తదుపరి ఆదేశాలు వచ్చే వరకు మూసివేసినట్లు డీఎంఆర్సీ తెలిపింది. రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్ తదితర స్టేషన్లు ఇందులో ఉన్నాయి.
అయితే రాజీవ్ చౌక్, మండి హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్లలో ఇంటర్చేంజ్ సౌకర్యం యథావిధిగా అందుబాటులో ఉంటుందని డీఎంఆర్సీ స్పష్టం చేసింది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని సూచించింది.
Comments
Loading comments...