వార్తలకు తిరిగి వెళ్లండి
తూర్పుగోదావరిలో పెద్దపులి కోసం గాలింపు

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం కరకపాడు, నందిగూడెం అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. పులి పాదముద్రలను గుర్తించిన అటవీశాఖ అధికారులు రేడియో కాలర్ సాయంతో దాని కదలికలను పర్యవేక్షిస్తున్నారు.
పులిని బంధించేందుకు మూడు బృందాలతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. డ్రోన్లు, ట్రాప్ కెమెరాలు వినియోగిస్తూ గాలిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...