వార్తలకు తిరిగి వెళ్లండి

నవాబుపేటకు చెందిన రైతు సిందం గంగన్న పశువులను మేతకు తీసుకెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన నెలకొంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు గ్రామస్థులతో కలిసి సమీప అటవీ ప్రాంతంలో గాలింపు చేపట్టారు.
భారీ వర్షాల కారణంగా అడవిలో దారి తప్పి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం వరకు గంగన్న ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

