వార్తలకు తిరిగి వెళ్లండి
పెద్దాపురంలో 12వ శతాబ్దపు శిల్పాలు

పెద్దాపురంలోని పలు ఆలయాల్లో 12వ శతాబ్దానికి చెందిన అరుదైన శిల్పాలు ఉన్నట్లు చరిత్ర పరిశోధకుడు కరిపె రాజ్కుమార్ వెల్లడించారు. సోమవారం ఆయా ఆలయాలను సందర్శించిన ఆయన, మల్లికార్జునస్వామి గుడిలోని మల్లన్న విగ్రహం నాటి రాజవంశానికి చెందిన వీరగల్లు అని స్పష్టం చేశారు.
అలాగే పోచమ్మ ఆలయంలోని పోతలింగన్న, యోగ నర్సింహస్వామి ఆలయంలోని కాల భైరవుడి విగ్రహాలు కూడా 12వ శతాబ్దానికే చెందినవని పేర్కొన్నారు.
Comments
Loading comments...